లక్ష్మీ… సంపదలకు అధిదేవత. ఆమె అనుగ్రహం ఉంటేనే సకల సంపదలు. లక్ష్మీ కటాక్షం పొందాలనే కోరిక ధనవంతులు కావాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. పేదవారి గా ఉండడానికి ఎవ్వరూ ఇష్టపడరు. వంద శాతం పనులు డబ్బుతోనే పనులు అవుతాయి అనేది జగమెరిగిన సత్యం. కానీ అందిరీ మీద లక్ష్మీ కటాక్షం ఉండదు. అయితే మీరు కానీ ఈ తప్పులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది.
లక్ష్మీ కటాక్షం కోసం ఐదు చిన్న పరిహారాలు అవి పాటిస్తే లక్ష్మీదేవి మీ గృహంలో నిలుస్తోంది. ఆ పరిహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం… మొట్టమొదటి మనం చేసే పని ఒక క్రమమైన పద్ధతిలో ఇష్టంగా చేయడం వల్ల లక్ష్మి అమ్మవారు మనల్ని వరిస్తుంది. అద్భుతమైన ఫలితాలను పొందుతారు. గృహంలో స్త్రీలు తెల్లవారుజామునే అంటే ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపు స్నానం చేయడం మంచిది. దీనవల్ల లక్ష్మీకటాక్షం కలుగుతుంది. స్నానానంతరం శుభ్రమైన వస్త్రాలు ధరించి దేవుడి ముందు ఆవునేతితో గాని, నువ్వుల నూనెతో గానీ, కొబ్బరి నూనెతోగాని దేవుడికి దీపారాధన చేయడం మంచిది. లక్ష్మీకటాక్షం కలుగుతుంది. గృహంలో కొవ్వ తులు, కిరోసిన్ దీపాలు వెలిగించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుందని పెద్ద వారు పేర్కొన్నారు. మూడో పని ఎప్పుడైనా నూతన వస్త్రాలను ధరించిన అప్పుడు ఆ వస్త్రాలకు పసుపు కుంకుమ పెట్టి రూపాయి బిళ్ళను షర్ట్ జేబులో అయినా ప్యాంట్ జేబులో అయినా వేసుకోవడం మంచిది. అప్పుడు ఆ దుస్తులను ధరించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. లక్ష్మీ అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇక నాలుగవ పని రోజు చెప్పులను గాని బూట్లను గానీ వేసుకునేటప్పుడు కుడికాలు ముందు పెట్టి వేసుకోవాలి. ఈ విధంగా అసభ్యంగా చేయడంవల్ల లక్ష్మీ అమ్మవారు అనుగ్రహిస్తుంది. ముందే ఎడమ కాలు పెట్టి వేసుకోవడం వల్ల అలక్ష్మి చోటు చేసుకుంటుంది. గృహంలో ఎప్పటికీ సువాసన వచ్చేటట్టుగా ఉండాలి. చెడు వాసన రాకుండా ఉండడం ముఖ్య. ఇలా వస్తే చేడువాసన వస్తే అక్కడ ఆలక్ష్మి నివాసం ఏర్పర్చుకుంటుంది. మరొకటి ఒక వెండి పాత్రలను తీసుకుని లేదా రాగి పాత్రను తీసుకొని దాంట్లో ఒక పచ్చకర్పూరం వేసి బీరువాలో లాకర్లో పెట్టుకోవడం వల్ల మీ ఐశ్వర్యాన్ని ఇంకా ఇంకా రెండింతలు వృద్ధి చేస్తుంది. ఇలా చేసినట్లయితే అష్టైశ్వర్యాలను భోగ భాగ్యాలను రెట్టింపు అవుతాయి.